హైదరాబాద్ : ఓ హోటల్లో బీజేపీ ముఖ్యనేతల సమావేశం

ABN , First Publish Date - 2020-07-11T22:00:47+05:30 IST

సచివాలయం కూల్చివేత వ్యవహారంపై గత కొన్నిరోజులుగా ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ : ఓ హోటల్లో బీజేపీ ముఖ్యనేతల సమావేశం

హైదరాబాద్ : సచివాలయం కూల్చివేత వ్యవహారంపై గత కొన్నిరోజులుగా ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై శనివారం నాడు బీజేపీ ముఖ్యనేతలు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.


భేటీలో భాగంగా తాజా రాజకీయ పరిణామాలు, సచివాలయం, నల్లపోచమ్మ దేవాలయం కూల్చివేత, కరోనా తీవ్రత, కేంద్రం రాష్ట్రానికి అందించిన సహాయం,  భవిష్యత్ కార్యాచరణపై నిశితంగా చర్చిస్తున్నారు. ఈ భేటీ అనంతరం మీడియా మీట్ నిర్వహించి వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. కాగా.. శుక్రవారం నాడు మురళీధర్ రావు ఈ కూల్చివేతల వ్యవహారంపై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం విదితమే.

Updated Date - 2020-07-11T22:00:47+05:30 IST