బీజేపీ నేతల నిరసన

ABN , First Publish Date - 2020-05-27T10:35:12+05:30 IST

స్థానిక బీజేపీ నేతలు కావలిలో మంగళవారం నిరసన ఉపవాస దీక్షలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కందుకూరి ..

బీజేపీ నేతల నిరసన

కావలి :  స్థానిక బీజేపీ నేతలు కావలిలో మంగళవారం నిరసన ఉపవాస దీక్షలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కందుకూరి వెంకటసత్యనారాయణ ఆధ్వర్యంలో,  పట్టణ అధ్యక్షుడు కే బ్రహ్మానందం ఆధ్వర్యంలో వేర్వేరుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షలు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీవీసీ సత్యం, కంచర్ల మురళీధర్‌ నాయుడు, పాలడుగు సుభాషిణి,  వరలక్ష్మమ్మ, ఉప్పుటూరు శేషమ్మ, మస్తాన్‌ వలి తదితరులు పాల్గొన్నారు.


బుచ్చిరెడ్డిపాళెం : స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు గండి రఘురామయ్య, కార్యకర్తలు రామిశెట్టి మోహన్‌బాబు, రామిశెట్టి రమణమ్మ, జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు వేర్వేరుగా నివాసాల్లో ఉపవాస దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెంచల ప్రసాద్‌, రత్న ప్రసాద్‌, కృష్ణారెడ్డి, కొప్పోలు మస్తానయ్య, రోసిరెడ్డి, అశోక్‌రెడ్డి, వెంకటరమణయ్య, సంజీవకుమార్‌,  కోటేశ్వరరావు, కొండారెడ్డి, మనోహర్‌రెడ్డి, పెంచలకృష్ణ, ఖాదర్‌బాషా, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.


 కావలి రూరల్‌ : కావలి పట్టణ బీజేపీ కార్యాలయంలో రూరల్‌ మండల అధ్యక్షుడు మామిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం ఉపవాస దీక్ష జరిగింది. దేవాలయ ఆస్తుల అమ్మకాలను నిరసిస్తూ ఇళ్ల వద్దే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు కే శ్రీనివాసులు, బండ్ల వేణు, ప్రళయకావేరి ప్రభాకర్‌, పామంజి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


అల్లూరు : స్థానిక పాతబస్టాండు కూడలిలోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ నేతలు  నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర దళిత మోర్చ మాజీ కార్యదర్శి ఎల్లు సాల్మన్‌రాజు, తదితరులు పాల్గొన్నారు. 


బిట్రగుంట: బోగోలులోని చెంచులక్ష్మీపురం కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో బీజేపీ నేతలు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో నేతలు పసుపులేటి వెంకటేశ్వర్లు, గుర్రం వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌, ఇజ్రాయల్‌, విజయ్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-05-27T10:35:12+05:30 IST