డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి
ABN , First Publish Date - 2022-07-07T04:04:01+05:30 IST
భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, భారతదేశ మొదటి పరిశ్రమల శాఖ మంత్రి, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీకి బీజేపీ జిల్లా కార్యాలయంలో నాయకులు బుధవారం ఘన నివాళులర్పించారు.
నెల్లూరు(స్టోన్హౌ్సపేట), జూలై 6: భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, భారతదేశ మొదటి పరిశ్రమల శాఖ మంత్రి, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీకి బీజేపీ జిల్లా కార్యాలయంలో నాయకులు బుధవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు భరత్కుమార్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ దేశ సమగ్రత కోసం తన ప్రాణాలను అర్పించిన దేశభక్తుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, ఉపాధ్యక్షురాలు కాకు విజయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శులు బి శ్రీనివాసులు, గడ్డం విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.