డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీకి ఘన నివాళి

ABN , First Publish Date - 2022-07-07T04:04:01+05:30 IST

భారత రాజ్యాంగ పరిషత్‌ సభ్యుడు, భారతదేశ మొదటి పరిశ్రమల శాఖ మంత్రి, భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీకి బీజేపీ జిల్లా కార్యాలయంలో నాయకులు బుధవారం ఘన నివాళులర్పించారు.

డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీకి ఘన నివాళి
నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు

నెల్లూరు(స్టోన్‌హౌ్‌సపేట), జూలై 6: భారత రాజ్యాంగ పరిషత్‌ సభ్యుడు, భారతదేశ మొదటి పరిశ్రమల శాఖ మంత్రి, భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీకి బీజేపీ జిల్లా కార్యాలయంలో నాయకులు బుధవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ దేశ సమగ్రత కోసం తన ప్రాణాలను అర్పించిన దేశభక్తుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, ఉపాధ్యక్షురాలు కాకు విజయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శులు బి శ్రీనివాసులు, గడ్డం విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T04:04:01+05:30 IST