స్థలం విషయంలో ఇద్దరు BJP Leaders మధ్య ముదిరిన వివాదం

ABN , First Publish Date - 2022-05-08T13:34:16+05:30 IST

జూబ్లీహిల్స్, రహమత్‎నగర్‎లో ఇద్దరు బీజేపీ నాయకుల మధ్య స్థలం విషయంలో వివాదం ముదిరింది. బీజేపీ నాయకుడు బాలా ప్రకాష్

స్థలం విషయంలో ఇద్దరు BJP Leaders మధ్య ముదిరిన వివాదం

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని రహమత్‎నగర్‎లో ఇద్దరు బీజేపీ నాయకుల మధ్య ఒక స్థలం విషయంలో తలెత్తిన వివాదం కాస్తా ముదిరింది. ఒకరిపై ఒకరు భౌతిక దాడి చేసుకునే వరకు వెళ్లింది. బీజేపీ నాయకుడు బాలా ప్రకాష్‌పై అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు నేతలు గోవర్ధన్ యాదవ్, మల్లికార్జున్ అనుచరులు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు. రహమత్‎నగర్‎లోని 224 గజాల స్థలం వివాదం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఇద్దరు కూడా న్యాయస్థానంలో ఒకరిపై మరోకరు కేసులు వేసుకున్నారు. ప్రస్తుతం ఆ కేసులు కోర్టులో కొనసాగుతున్నాయి. ఇక తాజాగా జరిగిన ఈ ఘర్షణలో గాయపడిన వారిని స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో గోవర్ధన్ యాదవ్, మల్లికార్జున్, బాలాప్రకాష్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‎లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more