HYD: బిపిన్ రావత్కు నివాళులర్పించిన బీజేపీ నేతలు
ABN , First Publish Date - 2021-12-09T18:29:23+05:30 IST
ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్కు బీజేపీ నేతలు నివాళులర్పించారు.
హైదరాబాద్: ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్కు బీజేపీ నేతలు నివాళులర్పించారు. గురువారం బీజేపీ కార్యాలయంలో బిపిన్ రావత్ చిత్రపటానికి బీజేపీ నేతలు డీకే అరుణ, వివేక్, ఇంద్రసేనారెడ్డి తదితరులు నివాళి అర్పించారు. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మరణించటం బాధకల్గించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. గొప్ప దేశభక్తుడిని దేశం కోల్పోయిందని ఆవేదన చెందారు. ఉగ్రవాద దాడులను తిప్పికొట్టగలిగే సామర్థ్యమున్న వ్యక్తి బిపిన్ రావత్ అని డీకే అరుణ కొనియాడారు.