అసెంబ్లీ ముట్టడికి యత్నం.. బీజేపీ నేతలు అరెస్ట్

ABN , First Publish Date - 2020-10-13T22:14:32+05:30 IST

ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను పీల్చి పిప్పి చేసే జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి

అసెంబ్లీ ముట్టడికి యత్నం.. బీజేపీ నేతలు అరెస్ట్

హైదరాబాద్: ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను పీల్చి పిప్పి చేసే జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి రాష్ట్ర బీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ నియోజకవర్గ నేతలు పలువురు పాల్గొన్నారు. ఎల్బీ నగర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఆకుల రమేశ్ గౌడ్, లింగోజీగూడ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ విజయ్ భాస్కర్, మాజీ ప్రెసిడెంట్ జాజుల ప్రవీణ్ గౌడ్, జనరల్ సెక్రటరి హరి దుర్గా ప్రసాద్, బీజేవైఎం ప్రెసిడెంట్ జోలం సాయి కిరణ్ యాదవ్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మెట్రో స్టేషన్ సమీపంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  

Updated Date - 2020-10-13T22:14:32+05:30 IST