మోదీ ప్రధాని కాదు సేవకుడు : బీజేపీ
ABN , First Publish Date - 2020-06-03T11:10:34+05:30 IST
నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రిగా కాకుండా ప్రధాన సేవకుడిగా దేశం కోసం పనిచేస్తున్నారని బీజేపీ నాయకులు ..
నెల్లూరు (స్టోన్హౌస్పేట), జూన్ 2 : నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రిగా కాకుండా ప్రధాన సేవకుడిగా దేశం కోసం పనిచేస్తున్నారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సన్నపురెడ్డి సురేష్రెడ్డి, భరత్కుమార్ యాదవ్, కర్నాటి ఆంజనేయ రెడ్డి, సురేంద్రరెడ్డి మాట్లాడుతూ మోదీ 2.0 ప్రభుత్వం మొదటి సంవత్సరం అనేక సవాళ్లతో పోరాటం చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందించిందన్నారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేలా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టారన్నారు. మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటిని జిల్లాలోని ప్రతి గడపకు తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టామన్నారు. ఈనెల చివరి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో జగన్ పాలన కిరాతకంగా, రౌడీయిజంతో సాగుతోందని విమర్శించారు.