సిద్దిపేటలో పోలీసుల తీరు సిగ్గుచేటు : వివేక్‌

ABN , First Publish Date - 2020-10-27T17:32:36+05:30 IST

సిద్దిపేటలో పోలీసులు ప్రవర్తించిన తీరు సిగ్గుచేటుగా ఉందని బీజేపీ నేత వివేక్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన..

సిద్దిపేటలో పోలీసుల తీరు సిగ్గుచేటు : వివేక్‌

హైదరాబాద్ : సిద్దిపేటలో పోలీసులు ప్రవర్తించిన తీరు సిగ్గుచేటుగా ఉందని బీజేపీ నేత వివేక్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పోలీసుల్ని సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్‌ కేడర్‌లా వాడుకుంటున్నారని ఆరోపించారు. దుబ్బాకలో గెలుస్తామనే నమ్మకం ఉంటే టీఆర్ఎస్ పోలీసులను ఎందుకు వాడుకుంటోంది? అని వివేక్‌ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పిరికి పంద.. అందుకే పోలీసులతో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు. ఓడిపోతామనే భయంతోనే రఘునందన్‌ను కేసులో ఇరికించే యత్నిస్తున్నారు. దుబ్బాకలో కాళేశ్వరం కమీషన్ల డబ్బుతో..ఓట్లు కొనాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు అని వివేక్‌ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అరెస్ట్‌తో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఏబీవీపీ, బీజేవైఎం నాయకులు ఆందోళనలు చేపట్టిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఏబీఎన్‌తో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2020-10-27T17:32:36+05:30 IST