KCR కారణంగా నీలగిరి నందనవనం ధ్వంసమవుతోంది : Vijayashanti
ABN , First Publish Date - 2022-05-10T02:42:47+05:30 IST
హైదరాబాద్ : CM Kcr కారణంగా నల్గొండ పట్టణంలో 5 ఎకరాల్లో ఉన్న నీలగిరి నందనవనం ధ్వంసమవుతోందని BJP సీనియర్ నేత Vijayashanti విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్ : CM Kcr కారణంగా నల్గొండ పట్టణంలో 5 ఎకరాల్లో ఉన్న నీలగిరి నందనవనం ధ్వంసమవుతోందని BJP సీనియర్ నేత Vijayashanti విమర్శలు గుప్పించారు. ఏడాదిలో ఒకటి, రెండు సార్లు కూడా వస్తారో రారో తెలియని సీఎం హెలీప్యాడ్ కోసం ఆఫీసర్లు వనాన్ని నాశనం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు విజయశాంతి ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు.
ఫేస్బుక్ పోస్ట్ యథాప్రకారం.. ‘ సీఎం కేసీఆర్ హరితహారం పేరుతో వేల చెట్లను నాటించినట్టు చెప్పుకుంటారు. కానీ ఆ సీఎం కారణంగానే ఒక ఉద్యానవనం ధ్వంసం అవుతోంది. ఏడాదిలో ఒకటి, రెండు సార్లు కూడా వస్తారో రారో తెలియని సీఎం హెలీప్యాడ్ కోసం నల్గొండ పట్టణంలో ఐదెకరాల్లో ఉన్న నీలగిరి నందనవనాన్ని ఆఫీసర్లు నాశనం చేస్తున్నరు. దగ్గర్లో 150 ఎకరాల భూములున్నా... కేవలం జిల్లా కలెక్టరేట్ పక్కనే హెలిప్యాడ్ ఉండాలనే ఒకే ఒక్క కారణంతో సుమారు 30 ఏండ్ల నాటి 300 చెట్లు నరికేస్తున్నరు. ఒక ఎకరం ఉంటే సరిపోయే హెలీప్యాడ్ కోసం జనావాసాల మధ్య తెలుగు విశ్వవిద్యాలయం నిర్మాణానికి కేటాయించిన రెండెకరాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందిన మరో మూడెకరాలు స్వాధీనం చేసుకున్నరు. నీలగిరి నందనవనంలోని మూడెకరాల్లో వేప, మద్ది, దిరిసెన తదితర చెట్లు పట్టణ ప్రజలను దశాబ్దాలుగా ఆహ్లాదపరుస్తున్నయి. కానీ కొద్దిరోజులుగా వీటితో పాటు తెలంగాణ హరితహారంలో భాగంగా ఈ ఆవరణలో లక్షలు ఖర్చుపెట్టి నాటిన మొక్కల్ని కూడా తొలగిస్తున్నరు. హెలీప్యాడ్ నిర్మించడానికి పట్టణ పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాల్లో ఖాళీ స్థలం ఉంది. ఎస్ఎల్బీసీ వద్ద సుమారు 150 ఎకరాలుండగా, దీంట్లో ప్రభుత్వ భవనాలకు వంద ఎకరాలు కేటాయించారు. అయినప్పటికీ ఇందులో ఇంకా 50 ఎకరాల వరకు ఖాళీగా ఉంది. కానీ నీలగిరి నందనవనాన్ని నరికేసి అక్కడే హెలీప్యాడ్ నిర్మించడానికి అధికారులు మొగ్గు చూపుతున్నరు. హరితహారంతో ఎంతో చేశామని చెప్పుకునే కేసీఆర్ దగ్గర దీనికి జవాబుందా? ఇప్పటికైనా ఈ విధ్వంస కాండను ఆపాలి’ అని విజయశాంతి పేర్కొన్నారు.