బీజేపీ తలుచుకుంటే కేసీఆర్ తిరుగలేరు: విజయశాంతి
ABN , First Publish Date - 2021-11-15T22:07:47+05:30 IST
రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే సీఎం
హైదరాబాద్: రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే సీఎం కేసీఆర్ కూడా తెలంగాణలో తిరుగలేరని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను రైతుల ముసుగులో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవటం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని విజయశాంతి మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.