కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం: తరుణ్‌చుగ్

ABN , First Publish Date - 2021-10-26T23:20:45+05:30 IST

జిల్లాలోని హుజురాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్ఎస్

కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం: తరుణ్‌చుగ్

కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని బీజేపీ రాష్ట్ర ఇన్‌‌చార్జి తరుణ్‌చుగ్ ఆరోపించారు. హుజురాబాద్ ప్రజలను కేసీఆర్ కుటుంబం అవమానించిందన్నారు. హుజురాబాద్‌లో కుక్కను పెట్టినా గెలుస్తామని టీఆర్ఎస్ నాయకులు అన్నారని ఆయన పేర్కొన్నారు. రాచరిక, దోపిడీ, అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు ఓడగొట్టాలని తరుణ్‌చుగ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందన్నారు. ధనవంతుల కోసం మాత్రమే టీఆర్ఎస్ పనిచేస్తోందని తరుణ్‌చుగ్ ఆరోపించారు. 


Updated Date - 2021-10-26T23:20:45+05:30 IST