డీజీపీ ఖబర్దార్..: స్వామి గౌడ్
ABN , First Publish Date - 2021-12-22T01:15:43+05:30 IST
దేశ ప్రధాని దిష్టిబొమ్మ తగులబెడితే సెక్యూరిటీ
నాగర్కర్నూల్: దేశ ప్రధాని దిష్టిబొమ్మ తగులబెడితే సెక్యూరిటీ ఇస్తావా అని రాష్ట్ర డీజీపీపై బీజేపీ కోర్ కమిటీ సభ్యులు స్వామి గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని కొల్లాపూర్లో జరిగిన బీజేపీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి స్వామి గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులను, దళితులను, రైతులను సీఎం కేసీఆర్ మోసం చేశాడన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు రాలేదన్నారు. ఉద్యోగాల కోసం యువత ఎదురు చూపులు చూస్తున్నారన్నార. కేసీఆర్ ఇంటి ముందు చావు డబ్బు, దిష్టిబొమ్మ తగలబెట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.