శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఏపీ ఇన్చార్జ్
ABN , First Publish Date - 2020-10-28T13:58:29+05:30 IST
బీజేపీ ఏపీ ఇన్చార్జ్ సునిల్ దియోధర్ బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల: బీజేపీ ఏపీ ఇన్చార్జ్ సునిల్ దియోధర్ బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ శతాబ్దాలుగా శేషాచల కోండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు కేంద్ర బలగాల సహాయాన్ని సీఎం కోరాలన్నారు. స్మగ్లింగ్ అరికట్టి... శేషాచల కోండల పవిత్రతను కాపాడాలి అని ప్రధానికి విజ్ఞప్తి చేస్తామని సునీల్ దియోధర్ తెలిపారు.