జగన్ గొప్పలకు పోయి... : Somuveerraju

ABN , First Publish Date - 2022-04-18T16:11:30+05:30 IST

బీజేపీ అన్ని రాష్ట్రాల్లో స్వచ్చ భారత్‌ను ప్రవేశపెట్టిందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు.

జగన్ గొప్పలకు పోయి... : Somuveerraju

విజయవాడ: బీజేపీ అన్ని రాష్ట్రాల్లో స్వచ్చ భారత్‌ను ప్రవేశపెట్టిందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు. సోమవారం కృష్ణలంక ప్రాంతంలో నిర్వహించిన స్వచ్చ భారత్‌లో సోమువీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వచ్ఛ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ రాష్ట్రానికి వెయ్యి కోట్లు కేటాయించిందని తెలిపారు. రాష్ట్రంలో స్వచ్చ భారత్ ఎలా జరుగుతుందో పరిశీలించామన్నారు. ఏపీ‌ ప్రభుత్వం స్వచ్చ భారత్ నిధులు సవ్యంగా ఖర్చు పెట్టడం లేదని విమర్శించారు. స్వచ్చ భారత్ కరెక్ట్‌గా జరిగితే వ్యాధులు తగ్గుతాయన్నారు. దీని వల్ల వైద్య ఆరోగ్య శాఖకు వ్యయం కూడా తగ్గుతుందని తెలిపారు. రేపు అంగన్ వాడీ కేంద్రాలను కూడా పరిశీలిస్తామన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణానికి కేంద్రం రూ.49వేల కోట్లు ఖర్చు చేసిందని ఆయన చెప్పారు.


జగన్ గొప్పలకు పోయి మౌలిక వసతుల కల్పనకు రూ.32వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఎక్కడ వసతులు కల్పించారో క్షేత్ర స్థాయిలో జగన్ పరిశీలించాలని సూచించారు. మోడీ కట్టించే ఇళ్లు పూర్తి కాకుండానే పన్నులు వేసి దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇటువంటి డొల్ల ప్రకటనలు, డొల్ల ప్రభుత్వంతో ప్రజలు పాట్లు పడుతున్నారన్నారు. ‘‘ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా... 32వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించాలి... ఇటువంటి పరిశీలనలు చేసి రాష్ట్ర ప్రభుత్వం చేసే మోసాలను ప్రజలకు వివరిస్తాం’’ అని సోమువీర్రాజు అన్నారు. 

Updated Date - 2022-04-18T16:11:30+05:30 IST