‘వైసీపీ ఎంపీలు, మంత్రులు మగాళ్ళైతే మా ముందుకు రండి’

ABN , First Publish Date - 2022-06-21T19:36:07+05:30 IST

ఆత్మకూరు అభివృద్ధికి నోచుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు.

‘వైసీపీ ఎంపీలు, మంత్రులు మగాళ్ళైతే మా ముందుకు రండి’

నెల్లూరు: ఆత్మకూరు అభివృద్ధికి నోచుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు(Somuveerraju) అన్నారు. మంగళవారం ఆత్మకూరులు బీజేపీ భారీ రోడ్‌ షోలో సోమువీర్రాజు పాల్గొని ప్రసంగించారు. ఆత్మకూరులో రోడ్లు, గుంతలు చూడలేక మంత్రులు రోజా ,అంబటి తదితర మంత్రులు నల్ల కళ్ళద్దాలతో వస్తున్నారని యెద్దేవా చేశారు. గ్రామాల్లో అభివృద్ధికి రూ.500 కోట్లు కేంద్రం ఇచ్చిందని..అయినా రోడ్లు వేయాలేదని మండిపడ్డారు. దీనిపై మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 23న జరిగే ఎన్నికల్లో వారందరికీ బుద్ధి చెప్పాలని... బ్యాలెట్‌లో రెండవ నెంబర్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ‘‘వైసీపీ ఎంపీలు, మంత్రులు మగాళ్ళు అయితే మా ముందుకు రండి’’ అంటూ సోమువీర్రాజు ఛాలెంజ్ చేశారు. 

Updated Date - 2022-06-21T19:36:07+05:30 IST