సెలవులు వేసవిలో కాకుండా వర్షాకాలంలో ఇస్తారా?: Somuveerraju
ABN , First Publish Date - 2022-04-25T14:54:32+05:30 IST
ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
అమరావతి: ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... సెలవులు వేసవిలో కాకుండా వర్షాకాలం ఇస్తారా అంటూ యెద్దేవా చేశారు. మే7వ తేదీతో ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతున్న దశలో వాల్యూవేషన్ డ్యూటీలో ఉండే ఉపాధ్యాయులకు ఈఎల్స్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ విధంగా డొంకతిరుగుడుగా వ్యవహరిస్తోందని సోమువీర్రాజు మండిపడ్డారు.