ఎవరి అసెంబ్లీ స్థానాలకు వారే సీఎంగా ఎమ్మెల్యేల తీరు: Somuveerraju

ABN , First Publish Date - 2022-01-08T19:18:10+05:30 IST

ఎమ్మెల్యేలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు.

ఎవరి అసెంబ్లీ స్థానాలకు వారే సీఎంగా ఎమ్మెల్యేల తీరు: Somuveerraju

అమరావతి: ఎమ్మెల్యేలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. ఎమ్మెల్యేలు ఏం చెబితే అదే చేయాలనుకున్నట్లు  పోలీసు, రెవెన్యూ, పరిపాలనా వ్యవస్థలు మారిపోయాయన్నారు. ఎమ్మెల్యేలు వారి అసెంబ్లీ స్థానానికి సీఎంగా మారిపోయారని విరుచుకుపడ్డారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా ఎమ్మెల్యేలకు తాబేదారులుగా మారిపోయిందన్నారు. జీతం సీఎంలు ఇవ్వడం లేదని... ప్రజలు ఇస్తున్నారని బీజేపీ నేత అన్నారు. ఎమ్మెల్యేలు వస్తుంటే పోలీసులు పరుగులు పెడుతున్నారన్నారు. పోస్టింగుల కోసం ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చే సాంప్రదాయం మారాలని... అవసరమైతే సీఎం జీవో జారీ చేయాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-01-08T19:18:10+05:30 IST