వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎవరిచ్చారు?: Somuveerraju

ABN , First Publish Date - 2022-06-08T17:30:57+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు (Somuveerraju) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎవరిచ్చారు?: Somuveerraju

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు (Somuveerraju) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్సీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.... వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అడుగడుగునా ఆంక్షలతో పోలీసు భద్రత మధ్య రాష్ట్రాన్ని ఎంతకాలం పాలిస్తారని నిలదీశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని ఉద్రిక్త పరిస్థితులను నిర్మాణం చేయదలచుకోలేదని, ఎస్పీ స్థాయి అధికారికి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఆంక్షలెందుకు అని అడిగారు. పోలీసు శాఖ ద్వారా ఈ దుందుడుకు చర్యలు తమ ప్రభుత్వం పాలన, అసమర్ధతను బయటపెడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ప్రభుత్వ నిఘా వర్గాలకు కూడా తెలియని స్థాయికి రాష్ట్ర పాలన దిగజారిందనే విషయాన్ని తమ చేస్తున్న చర్యలు అద్దం పడుతున్నాయని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-06-08T17:30:57+05:30 IST