వైసీపీ సర్కార్ రోడ్ల నిర్మాణం చేయకుండా ఏం చేస్తోంది?: Somu veerraju

ABN , First Publish Date - 2022-02-18T19:49:26+05:30 IST

రాష్ట్రంలో జాతీయ రహదారులను విస్తరణ చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

వైసీపీ సర్కార్ రోడ్ల నిర్మాణం చేయకుండా ఏం చేస్తోంది?: Somu veerraju

ఏలూరు: రాష్ట్రంలో జాతీయ రహదారులను విస్తరణ చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం చేయకుండా ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేంద్రం రోడ్లు వేస్తే వైసీపీ ప్రభుత్వం తనవిగా ప్రచారం చేసుకోవడం దారుణమని మండిపడ్డారు. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయం వైపు కేంద్రం ప్రయత్నం చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే అభివృద్ధి చేస్తోందని ముఖ్యమంత్రి విజయవాడ సభలో అంగీకరించారని సోమువీర్రాజు అన్నారు. 

Updated Date - 2022-02-18T19:49:26+05:30 IST