విజయవాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సోమువీర్రాజు

ABN , First Publish Date - 2021-01-26T16:02:12+05:30 IST

72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

విజయవాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సోమువీర్రాజు

విజయవాడ: 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వ సప్తాహ దేశంగా.. రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్న రోజు అని అన్నారు. గణతంత్రం‌ ఏర్పడిన తరువాత భారతీయులు  ఆచరిస్తున్న తీరు ఆదర్శనీయమని కొనియాడారు. భారతీయ విధానం ప్రపంచ దేశాలు కూడా అనుసరిస్తున్నాయని తెలిపారు. యావత్ భారతదేశాన్ని ఒక తాటి పైకి తీసుకుని రావడం మోదీ గొప్ప పాలనకు నిదర్శనమని ఆయన చెప్పారు. 


భారతీయ చట్టం, రాజ్యాంగం ఆధారంగా ముందుకు వెళుతున్నామన్నారు. కొన్ని ప్రపంచ దేశాలకు మనమే కరోనా టీకాను అందిస్తున్నామని తెలిపారు. రామ జన్మభూమి నుంచి రైతులు, సైనికులు అందరినీ ఏకతాటి పైకి తీసుకు రావడం... చైనా, పాకిస్తాన్ కుట్రలను బలంగా తిప్పి కొట్టడం మోదీకే సాధ్యం అయ్యిందన్నారు. ఏపీలో కూడా మంచి పనులతో అభివృద్ధిని అంది పుచ్చుకోవాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం అనవసర విషయాలపై ఆసక్తి చూపిస్తుందని మండిపడ్డారు. పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి పెడితే... బీజేపీ సహకరిస్తుందని సోమువీర్రాజు పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-26T16:02:12+05:30 IST