బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుంది: షేక్ బాజి

ABN , First Publish Date - 2022-01-13T19:46:04+05:30 IST

బీజేపీ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందని ఆ పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజి అన్నారు.

బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుంది: షేక్ బాజి

కర్నూలు: బీజేపీ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందని ఆ పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజి అన్నారు. ఆత్మకూరులో జరిగిన ఘటనలో స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విధ్వంసకర శక్తులు పోలీసు స్టేషన్ మీద దాడి చేశాయన్నారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆత్మకూరు ఘటనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఎన్ఐఏ విచారణ కోరుతామన్నారు. ఘటనలో బాధ్యులైన వారిని విడిచి పెట్టేది లేదని షేక్ బాజి స్పష్టం చేశారు. 

Updated Date - 2022-01-13T19:46:04+05:30 IST