26 ఏళ్ల మహిళపై అత్యాచారం.. యూపీ బీజేపీ నేతపై కేసు
ABN , First Publish Date - 2021-12-12T21:23:51+05:30 IST
మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాకు చెందిన బీజేపీ నేతలపై పోలీసులు..
బల్లియా: మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాకు చెందిన బీజేపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 26 ఏళ్ల బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ వెనుకబడిన తరగతుల విభాగం ప్రధాన కార్యదర్శి రంజిత్ మౌర్యపై కేసు నమోదు చేసినట్టు బైరియా సర్కిల్ అధికారి అశోక్ కుమార్ మిశ్రా తెలిపారు. గురువారం రాత్రి తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన రంజిత్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
బీజేపీ మహిళా విభాగానికి తనను ఉపాధ్యక్షురాలిని చేస్తానని చెప్పి తనతో అసభ్యంగా మాట్లాడేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మాట్లాడుతూ.. మహిళ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు తొలుత సంశయించారని ఆరోపించారు. మౌర్యను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళ, ఆమె తల్లి తనను కలిసి విషయం చెప్పిన తర్వాత తాను జోక్యం చేసుకోవడంతోనే పోలీసులు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు ఆమె అండగా ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.