బీజేపీతో పెట్టుకుంటే అగ్గితో తలగోక్కున్నట్టే: రాకేష్రెడ్డి
ABN , First Publish Date - 2022-01-04T22:06:06+05:30 IST
బీజేపీతో పెట్టుకుంటే అగ్గితో తలగోక్కున్నట్టేనని
హైదరాబాద్: బీజేపీతో పెట్టుకుంటే అగ్గితో తలగోక్కున్నట్టేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్రెడ్డి హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణ కావాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది పోలీసులు టీఆర్ఎస్ పోలీసులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల కోసం దీక్ష చేస్తుంటే పోలీసులతో ఎంపీ సంజయ్ గల్లా పట్టించాడని కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసి తీరుతామని రాకేష్రెడ్డి స్పష్టం చేశారు.