బ్రేకింగ్: తృణమూల్ నేతతో భేటీ అయిన బీజేపీ నేత

ABN , First Publish Date - 2021-06-13T00:49:09+05:30 IST

తృణమూల్ నేత కునాల్ ఘోష్‌తో బీజేపీ నేత రాజీవ్ బెనర్జీ భేటీ అయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం బెంగాల్

బ్రేకింగ్: తృణమూల్ నేతతో భేటీ అయిన బీజేపీ నేత

కోల్‌కతా : తృణమూల్ నేత కునాల్ ఘోష్‌తో బీజేపీ నేత రాజీవ్ బెనర్జీ భేటీ అయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే ఇది పూర్తిగా మర్యాద పూర్వక భేటీ అని, రాజకీయాలేమీ లేవని రాజీవ్ బెనర్జీ ప్రకటించారు. తృణమూల్‌లో చేరిక గురించి చర్చలేమీ జరగలేదని, తాను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నానని వ్యాఖ్యానించారు.  బీజేపీ నేత రాజీవ్ బెనర్జీ తృణమూల్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఎన్నికల సమయంలో ఆయన తృణమూల్ నుంచి బీజేపీలోకి మారారు. ప్రస్తుతం బెంగాల్‌లో ’ఘర్ వాపసీ’ కార్యక్రమం సాగుతోంది. తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన చాలా మంది నేతలు తిరిగి తృణమూల్‌లో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. 


Updated Date - 2021-06-13T00:49:09+05:30 IST