Ponguleti Comments: చెస్ పోటీల్లో ప్రధాని ఫొటో లేకపోవడమేంటి?
ABN , First Publish Date - 2022-07-28T14:48:37+05:30 IST
మహాబలిపురంలో జరుగనున్న అంతర్జాతీయ చెస్ పోటీల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) ఫొటో లేకపోవడం సరి కాదని, ఈ విషయంలో
చెన్నై, జూలై 27 (ఆంధ్రజ్యోతి): మహాబలిపురంలో జరుగనున్న అంతర్జాతీయ చెస్ పోటీల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) ఫొటో లేకపోవడం సరి కాదని, ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం తగిన ప్రోటోకాల్(Protocol) పాటించకపోవడం బాధాకరమని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ పొంగులేటి సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. చెస్ పోటీల(Chess competitions) ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు గురువారం ప్రధాని రానున్న సందర్భంగా పొంగులేటి బుధవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ పేర్కొన్న విధంగా ఆగస్టు 9వ నుంచి 15వ తేదీ వరకు దేశ ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కూల్ సిల్బ్సలో మార్పు రావాలని, కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తమిళనాడులో కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.