ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వం కాపాడాలి: పాతూరి

ABN , First Publish Date - 2021-01-21T18:39:37+05:30 IST

పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం తెలిపారు.

ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వం కాపాడాలి: పాతూరి

విజయవాడ: పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ  రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం తెలిపారు. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో వైసీపీ ఎన్నికలు కావాలన్నారని... ఇప్పుడు తగ్గుముఖం పట్టాక ఎన్నికలు ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వం కాపాడాలని హితవు పలికారు. కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి దాసోహమై పని‌చేస్తున్నాయని ఆరోపించారు. వారు చేస్తున్న ప్రకటనలు .. ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తిగా రద్దు చేయాలని... మళ్లీ మొదటి నుంచీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని పాతూరి నాగభూషణం కోరారు. 

Updated Date - 2021-01-21T18:39:37+05:30 IST