రైతులకు పెట్టుబడి సాయం చేసిన ఘనత మోదీదే: NVSS

ABN , First Publish Date - 2022-05-03T18:36:23+05:30 IST

రైతులకు పెట్టుబడి సాయం చేసిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీదే అని బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు.

రైతులకు పెట్టుబడి సాయం చేసిన ఘనత మోదీదే: NVSS

హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సాయం చేసిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీదే అని బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. రైతుల కోసమే రాహుల్ వస్తున్నాడంటే నవ్వుకుంటున్నారని అన్నారు. 1500 మంది యువకుల ఆత్మహత్యకు కారణమైన రాహుల్ ఏ మొహం పెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారని ప్రశ్నించారు. ఏనాడూ తెలంగాణ అంశాన్ని పార్లమెంటులో రాహుల్ మాట్లాడలేదని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్నదంతా కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా అని ఆరోపించారు. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా సాగుతోందని తెలిపారు. 5న జేపీ నడ్డా మహబూబ్ నగర్‌లో జరిగే సభకు, 14న మహేశ్వరం నియోజకవర్గంలో జరిగే సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ వెల్లడించారు. 

Read more