సుబ్బయ్య మృతితో బలహీన వర్గాల గొంతు మూగబోయింది: నాగోతు
ABN , First Publish Date - 2021-01-15T17:31:35+05:30 IST
పట్నం సుబ్బయ్య మరణంతో బలహీన వర్గాల గొంతు మూగబోయిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు.
అమరావతి: పట్నం సుబ్బయ్య మరణంతో బలహీన వర్గాల గొంతు మూగబోయిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. ఆయన మంత్రిగా ,శాసనసభ్యుడుగా ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశారన్నారు. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ పార్టీ విధానాలకు లోబడి పనిచేశారని చెప్పుకొచ్చారు. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నాగోతు రమేష్ నాయుడు కోరారు.