కేసీఆర్ నాయకుడు కావటానికి ఎన్టీయారే కారణం: మోత్కుపల్లి
ABN , First Publish Date - 2021-01-18T18:01:18+05:30 IST
స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించారు.
హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్టీఆర్కు జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని అన్నారు. కేసీఆర్ నాయకుడు కావటానికి ఎన్టీయారే కారణమని తెలిపారు. కొడుక్కి ఎన్టీఆర్ పేరు పెట్టినంత మాత్రాన రుణం తీరనట్లు కాదన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ను సమర్థిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ పరిచయం చేసిన పథకాలనే ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు.