బీజేపీ నేత మనోజ్ తివారికి Covid

ABN , First Publish Date - 2022-01-04T18:17:42+05:30 IST

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రబలుతోంది. ఒమైక్రాన్ వేరియంట్‌తో పాటు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది....

బీజేపీ నేత మనోజ్ తివారికి Covid

న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రబలుతోంది. ఒమైక్రాన్ వేరియంట్‌తో పాటు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.మంగళవారం పలువురు ప్రజాప్రతినిధులు, నేతలకు కరోనా వచ్చింది. బీజేపీ నేత మనోజ్ తివారీకి మంగళవారం జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.కరోనా వల్ల తనకు జ్వరం, జలుబు ఉన్నాయని దీంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు మనోజ్ తివారీ ట్వీట్ చేశారు.కరోనా వల్ల తాను ఉత్తరాఖండ్ రుద్రాపూర్ ప్రచారాన్ని వాయిదా వేసుకున్నానని తివారీ చెప్పారు.మనోజ్ తివారికి కరోనా రెండోసారి వచ్చింది. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ తోపాటు కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే కరోనా బారిన పడ్డారు. 


లక్నో నగరంలోని మేదాంత ఆసుపత్రిలో 25మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. బీహార్ రాష్ట్రంలోని నలందా మెడికల్ కాలేజీ,ఆసుపత్రిలో 72మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. మొత్తంమీద రెండు రోజుల్లోనే 159 మంది వైద్యులకు కరోనా సోకిందని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బినోద్ కుమార్ సింగ్ చెప్పారు. 


Updated Date - 2022-01-04T18:17:42+05:30 IST