ప్రధాని ‘విజయ్ సంకల్ప్’ సభ చరిత్రలో నిలిచిపోతుంది: Laxman

ABN , First Publish Date - 2022-06-29T20:57:36+05:30 IST

ప్రధన మంత్రి నరేంద్ర మోదీ విజయ్ సంకల్ప్ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీజేపీ రాజ్యసభ సభ్యడు లక్ష్మణ్ అన్నారు.

ప్రధాని ‘విజయ్ సంకల్ప్’ సభ చరిత్రలో నిలిచిపోతుంది: Laxman

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) విజయ్ సంకల్ప్ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీజేపీ రాజ్యసభ సభ్యడు లక్ష్మణ్(Laxman) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఫ్లెక్సీ రాజకీయాలు చేసే స్థాయికి కేసీఆర్ దిగజారిపోయారని విమర్శలు గుప్పించారు. కుటుంబ, అవినీతి పాలనను అంతమొందించడానికి మోదీ వస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటున్నారన్నారు. తెలంగాణకు సంస్కృతి, సంప్రదాయాలు కార్యవర్గ సమావేశాల్లో కన్పిస్తాయని అన్నారు. హోర్డింగ్‌ల ఏర్పాటు విషయంలో కేసీఆర్ ది చౌకబారుతనమని వ్యాఖ్యానించారు. అధికారం, డబ్బును అడ్డుపెట్టుకుని కేసీఆర్ పాలన చేయడం సరికాదన్నారు. రేవంత్, మంద కృష్ణ మాదిగలు ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరిస్తే బాగుంటుందని హితవుపలికారు. అగ్నిపథ్ పథకం యువకులకు అర్థం అయితే చాలు అని లక్ష్మణ్ తెలిపారు. 

Updated Date - 2022-06-29T20:57:36+05:30 IST