కాంగ్రెస్, టీఆర్ఎస్‌వి చీకటి ఒప్పందాలు: Laxman

ABN , First Publish Date - 2022-04-25T19:51:45+05:30 IST

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌వి చీకటి ఒప్పందాలని బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపించారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్‌వి చీకటి ఒప్పందాలు: Laxman

హైదరాబాద్: కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌వి చీకటి ఒప్పందాలని బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు అర్థం అవుతున్నాయన్నారు. బీజేపీనీ వ్యతిరేకించే పార్టీలను ఏకం చేయటానికి పీకే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైన మోదీని ఏమీ చేయలేరని, మూడో సారి కూడా దేశంలో బీజేపీదే అధికారమని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌యేతర ఫ్రంట్‌కు ఏర్పాటు ఏమైందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ కోసం కేసీఆర్ పనిచేయబోతున్నారన్నారు. గతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలసి పోటీచేశాయని గుర్తు చేశారు. మంత్రి కేటీఆర్ పెద్ద అజ్ఞాని అని వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్‌కు ఎవరు ప్రత్యర్ధి అనే విషయం ప్రజలకు తెలుసన్నారు. బీజేపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కేటీఆర్ ఓర్వలేకపోతున్నారని లక్ష్మణ్ అన్నారు. 

Updated Date - 2022-04-25T19:51:45+05:30 IST