తెలంగాణలో రాహుల్ టూర్‌పై లక్ష్మణ్ స్పందన

ABN , First Publish Date - 2022-05-07T19:38:13+05:30 IST

తెలంగాణలో రాహుల్ టూర్‌పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ స్పందించారు.

తెలంగాణలో రాహుల్ టూర్‌పై లక్ష్మణ్ స్పందన

న్యూఢిల్లీ: తెలంగాణలో రాహుల్ టూర్‌పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చెయ్యని పనులు ఇప్పుడు చేస్తామనంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు,  గల్లీలో లేదని...  రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైందని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే తెలంగాణ రైతులకు, నిరుద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుల చరిత్ర కాంగ్రెస్ ది అని వ్యాఖ్యానించారు.  టీఆర్‌ఎస్‌తో బీజేపీ ఏనాడు పొత్తు పెట్టుకోలేదు, పెట్టుకోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఓటేసినా టీఆర్‌ఎస్‌కే చెల్లుతుందన్నారు.  గెలిసిన వాళ్ళందరూ మూకుమ్మడిగా టీఆర్‌ఎస్‌లో చేరటం ఖాయమని బీజేపీ తెలిపారు.


రాహుల్ సభలు వృధా ప్రయాస అని అన్నారు. గెలిపించిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఒక గూటి పక్షులే అని... ఎన్నికల ముందో ఎన్నికల తర్వాతో కలుస్తారన్నారు.  బీజేపీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, మజ్లీస్‌లు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. రాజ్యాంగ సంస్థల్లో కేంద్రం జోక్యం ఉండదని తేల్చిచెప్పారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే చట్ట రీత్యా ఆయా సంస్థలు చర్యలు తీసుకుంటాయని లక్ష్మణ్ వెల్లడించారు. 

Read more