కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన బీజేపీ నేత లక్ష్మణ్

ABN , First Publish Date - 2022-05-12T17:08:57+05:30 IST

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌(Dharmendra Pradhan)తో బీజేపీ నేత లక్ష్మణ్(Laxman) గురువారం ఉదయం భేటీ అయ్యారు.

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన బీజేపీ నేత లక్ష్మణ్

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌(Dharmendra Pradhan)తో బీజేపీ నేత లక్ష్మణ్(Laxman) గురువారం ఉదయం భేటీ అయ్యారు. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల అమలు, ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ వినతి చేశారు. 10 అంశాలపై కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. పేద విద్యార్థులకు డిజిటల్ పరికరాలు అందించాలని కోరారు. బీసీ కులాల స్థితిగతులపై అధ్యయనానికి రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులపై.. పరిశీలన కోసం ప్రత్యేకంగా ఓబీసీ సెల్ ఏర్పాటు చేయాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. 

Read more