కక్ష సాధింపు చర్యలు సరైంది కాదు: Laxman

ABN , First Publish Date - 2021-11-16T19:08:29+05:30 IST

కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పూనుకోవటం సరైంది కాదని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు.

కక్ష సాధింపు చర్యలు సరైంది కాదు: Laxman

హైదరాబాద్: కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పూనుకోవటం సరైంది కాదని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిన విషయాన్ని గవర్నర్‌కు వివరించామన్నారు. బీజేపీ అధ్యక్షడిపై దాడిని టీఆర్ఎస్ పార్టీ దాడిగానే చూస్తున్నామని తెలిపారు. సమస్య లేని చోట ప్రభుత్వం సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ మంత్రి సొంత జిల్లా రైతులు పక్క రాష్ట్రంలో ధాన్యం అమ్ముకోవటం సిగ్గుచేటన్నారు. చేతకాకనే కేసీఆర్ నెపాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ పరాభవాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-11-16T19:08:29+05:30 IST