ప్రశ్నించే గొంతులు నులిమే ప్రయత్నాలను ఖండిస్తున్నాం: లంకా దినకర్
ABN , First Publish Date - 2021-05-15T18:01:44+05:30 IST
జగన్ ప్రభుత్వంపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి: జగన్ ప్రభుత్వంపై బీజేపీ నేత లంకా దినకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మీడియాపై దాడి , ప్రశ్నించే గొంతులపై దాడి విషయంలో దాదాపు సంవత్సరం క్రింద రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల పై కరోనా మొదటి వేవ్ ఉదృతంగా ఉన్న నాడు, తేది 14 ఆగష్ట్ 2020 న ఏమి చెప్పామో... అదే విధంగా సెకండ్ వేవ్ అతి ఉధృతంగా ఉన్న నేడు కూడా రాష్ట్రంలో రోజుకు 20వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదు అవుతున్నప్పుడు తమ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులు నులిమే ప్రయత్నాలను ఖండిస్తూన్నాం’’ అని బీజేపీ నేత ఫేస్బుక్ వేదికగా తెలియజేశారు.