వెలిగొండ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు కొండెక్కాయి: Lanka dinakar
ABN , First Publish Date - 2021-12-13T17:16:46+05:30 IST
వెలిగొండ నిర్వాసితులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు కొండెక్కాయని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శలు గుప్పించారు.
అమరావతి: వెలిగొండ నిర్వాసితులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు కొండెక్కాయని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శలు గుప్పించారు. నిర్వాసితులకు హామీ ఇచ్చిన 899 కోట్లు ఇవ్వాలేని జగన్ ప్రభుత్వం వల్ల పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రాంతం ఏడారి గా మారుతుందన్నారు. వెలిగొండ నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు గొంతు నులమడం అంటే పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల గొంతులో చుక్క నీరు లేకుండా చేయడమే అని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలో 15 లక్షల మందికి తాగునీరు - లక్షలాది ఏకరాలకు సాగు నీరు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో వెలిగొండ నిర్వాసితుల దుర్భర జీవితాలు దయనీయంగా మారాయని లంకా దినకర్ వ్యాఖ్యలు చేశారు.