Shame: మోదీ ఫొటో లేకపోవడం అవమానకరం: ఖుష్బూ
ABN , First Publish Date - 2022-07-29T14:22:38+05:30 IST
చెస్ ఒలంపియాడ్(Chess Olympiad) ప్రచార ప్రకటనలు, బ్యా నర్లు, పోస్టర్లలో ప్రధాని మోదీ ఫొటోలేకుండా చేయడం రాష్ట్రానికే అవమానకరమని బీజేపీకి
చెన్నై, జూలై 28 (ఆంధ్రజ్యోతి): చెస్ ఒలంపియాడ్(Chess Olympiad) ప్రచార ప్రకటనలు, బ్యా నర్లు, పోస్టర్లలో ప్రధాని మోదీ ఫొటోలేకుండా చేయడం రాష్ట్రానికే అవమానకరమని బీజేపీకి చెందిన ప్రముఖ నటి ఖుష్బూ(Khushboo) విమర్శించారు. అంతర్జాతీయ స్థాయి చెస్ పోటీలు జరగటం రాష్ట్రానికి గర్వకారణమే అయినా, ఈ పోటీలు మహాబలిపురంలో నిర్వహించేందుకు సాయపడింది కేంద్ర ప్రభుత్వ(Central Govt)మేనన్న విషయాన్ని మరవరాదన్నారు అంతర్జాతీయ స్థాయిలో పోటీ జరుగుతున్న ఈ పోటీల్లో ప్రధాని ఫొటోకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం గర్హనీయమన్నారు.