Bjp నేత కుటుంబానికి అన్నాడీఎంకే ఆర్థికసాయం
ABN , First Publish Date - 2021-10-27T14:09:31+05:30 IST
వాణియంబాడీ జీవానగర్ ప్రాంతంలో గత నెల హత్యకు గురైన బీజేపీ నేత వసీమ్ అక్రమ్ కుటుంబానికి అన్నాడీఎంకే రూ. 5 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటిం చింది. గతనెల 10వ తేదీ సా యంత్రం 7 గంటల ప్రాంతం
వేలూరు(Chennai): వాణియంబాడీ జీవానగర్ ప్రాంతంలో గత నెల హత్యకు గురైన బీజేపీ నేత వసీమ్ అక్రమ్ కుటుంబానికి అన్నాడీఎంకే రూ. 5 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటిం చింది. గతనెల 10వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంటి సమీపంలోని మసీదులో ప్రార్థనలు ముగించి వస్తున్న వసీమ్అక్రమ్ను కారులో వచ్చిన 8 మంది హత్య చేసి పరారయ్యారు. మంగళవారం అన్నాడీఎంకే మాజీ మంత్రి కేసీ వీరమణి, వాణియంబాడీ ఎమ్మెల్యే సెంథిల్కుమార్తో కలసి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థికసాయాన్ని అందజేశారు.