గ్రామాలన్నీ దావత్‌లకు అడ్డాలుగా మారాయి: ఈటల

ABN , First Publish Date - 2021-09-16T01:39:52+05:30 IST

హుజురాబాద్‌ నియోజకవర్గంలోని గ్రామాలన్నీ దావత్‌లకు అడ్డాలుగా

గ్రామాలన్నీ దావత్‌లకు అడ్డాలుగా మారాయి: ఈటల

కరీంనగర్: హుజురాబాద్‌ నియోజకవర్గంలోని గ్రామాలన్నీ దావత్‌లకు అడ్డాలుగా మారాయని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్‌లో మంత్రి హరీష్‌రావు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఈటల ఆరోపించారు. కేసీఆర్‌లాగే ఆయన కిందఉండే వారు కూడా అలాగే ఉన్నారని ఈటల పేర్కొన్నారు. చిల్లర రాతలు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. తనపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని ఈటల  పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-16T01:39:52+05:30 IST