క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతం: భరత్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-05-16T03:52:32+05:30 IST

క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేయటంలో శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలే కీలకమని ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు జీ. భరత్‌కుమార్‌ పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతం:  భరత్‌కుమార్‌
మాట్లాడుతున్న బీజేపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు భరత్‌కుమార్‌

శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలే కీలకం

బీజేపీ నెల్లూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్‌

కావలి, మే 15: క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేయటంలో శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలే కీలకమని ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు జీ. భరత్‌కుమార్‌ పేర్కొన్నారు. పట్టణంలోని ఎంజీఆర్‌ కల్యాణ మండపంలో ఆదివారం కావలి నియోజకవర్గస్థాయి శక్తి కేంద్ర ఇన్‌చార్జిలతో పట్టణ అధ్యక్షుడు కే. బ్రహ్మానందం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా భరత్‌కుమార్‌ పాల్గొని మాట్లాడుతూ జూన్‌ నెలలో శక్తి కేంద్రాల ఇన్‌చార్జీలతో విజయవాడలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం ఉంటుందన్నారు. అందులో భాగంగానే శక్తి కేంద్రాల పనితీరుపై ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో బూత్‌ కమిటీలు ఎలా పనిచేయాలో దిశనిర్దేశం చేశారు. భారతప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒక శక్తి కేంద్రానికి ఇన్‌చార్జి అని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాకు విజయలక్ష్మి మాట్లాడుతూ బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసే విధంగా శక్తి కేంద్రాల ఇన్‌చార్జీలు పనిచేయాలన్నారు. ఈసందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా టంగుటూరి బాలమురళీని నియమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పూనూరు మాధవరెడ్డి, పసుపులేటి వెంకటేశ్వర్లు, మామిడి వెంకటేశ్వర్లు, గోపిశెట్టి ప్రసాద్‌, లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T03:52:32+05:30 IST