కరోనా వైరస్ కంటే.. కల్వకుంట్ల వైరస్ ప్రమాదకరం: Bhanuprakash

ABN , First Publish Date - 2021-12-27T17:27:03+05:30 IST

కరోనా వైరస్ కంటే.. కల్వకుంట్ల వైరస్ ప్రమాదకరంగా మారిందని బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు భానుప్రకాష్ వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ కంటే.. కల్వకుంట్ల వైరస్ ప్రమాదకరం: Bhanuprakash

హైదరాబాద్: కరోనా వైరస్ కంటే.. కల్వకుంట్ల వైరస్ ప్రమాదకరంగా మారిందని బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు భానుప్రకాష్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ కంటే.. కల్వకుంట్ల కుటుంబం‌ కారణంగానే ఎక్కువ మంది చనిపోయారని ఆరోపించారు. నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని... టీఆర్ఎస్  ప్రభుత్వానికి ఉరేద్దామని పిలుపునిచ్చారు. ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని భానుప్రకాష్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-27T17:27:03+05:30 IST