మనోహర్ పారికర్ కుమారుడిని ఓడించిన బీజేపీ నేత.. అయినా సంతోషం నిల్!
ABN , First Publish Date - 2022-03-10T22:02:58+05:30 IST
రక్షణశాఖ మాజీ మంత్రి, దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ గోవా అసెంబ్లీకి జరిగిన
పనాజీ: రక్షణశాఖ మాజీ మంత్రి, దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అటనాసియో మాన్సెరెట్ (బాబూష్) చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే, ఈ విజయం తనకు సంతృప్తినివ్వలేదని బాబూష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలు తనకు ఓటు వేయలేదని ఆరోపించారు.
ఈ విషయాన్ని తాను బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రజలకు సరైన సందేశం పంపలేదని బాబూష్ అన్నారు. ఈ ఎన్నికల్లో పనాజీ నుంచి మాన్సెరెట్ను బరిలోకి దింపి, ఉత్పల్కు మరో నియోజకవర్గాన్ని బీజేపీ కేటాయించింది. అయితే, తనకు పనాజీనే కావాలని ఉత్పల్ పట్టుబట్టారు. అందుకు బీజేపీ అధిష్ఠానం నిరాకరించడంతో పార్టీ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి ఓటమి పాలయ్యారు.