మనోహర్ పారికర్ కుమారుడిని ఓడించిన బీజేపీ నేత.. అయినా సంతోషం నిల్!

ABN , First Publish Date - 2022-03-10T22:02:58+05:30 IST

రక్షణశాఖ మాజీ మంత్రి, దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ గోవా అసెంబ్లీకి జరిగిన

మనోహర్ పారికర్ కుమారుడిని ఓడించిన బీజేపీ నేత.. అయినా సంతోషం నిల్!

పనాజీ: రక్షణశాఖ మాజీ మంత్రి, దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అటనాసియో మాన్‌సెరెట్ (బాబూష్) చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే, ఈ విజయం తనకు సంతృప్తినివ్వలేదని బాబూష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలు తనకు ఓటు వేయలేదని ఆరోపించారు.


ఈ విషయాన్ని తాను బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రజలకు  సరైన సందేశం పంపలేదని బాబూష్ అన్నారు. ఈ ఎన్నికల్లో పనాజీ నుంచి మాన్‌సెరెట్‌ను బరిలోకి దింపి, ఉత్పల్‌కు మరో నియోజకవర్గాన్ని బీజేపీ కేటాయించింది. అయితే, తనకు పనాజీనే కావాలని ఉత్పల్ పట్టుబట్టారు. అందుకు బీజేపీ అధిష్ఠానం నిరాకరించడంతో పార్టీ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి ఓటమి పాలయ్యారు. 

Updated Date - 2022-03-10T22:02:58+05:30 IST