Bandi sanjay comments: తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు రానున్నాయి

ABN , First Publish Date - 2022-08-04T17:09:41+05:30 IST

తెలంగాణ (Telangana)లో మరిన్ని ఉప ఎన్నికలు రానున్నాయని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay)స్పష్టం చేశారు.

Bandi sanjay comments: తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు రానున్నాయి

యాదాద్రి: తెలంగాణ (Telangana)లో మరిన్ని ఉప ఎన్నికలు రానున్నాయని  బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay)స్పష్టం చేశారు. గురువారం ఉదయం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో మాట్లాడుతూ... 10 నుంచి 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే (TRS MLAs)లు ప్రజలతో ఒత్తిడి తెప్పించుకుని రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. మునుగోడు((Munugodu)లో బీజేపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkatreddy) బీజేపీ పార్టీ, మోడీ(Modi)కి అనుకూలంగా చాలా సందర్భాల్లో మాట్లాడారని  ఆయన తెలిపారు.


రానున్నది  బీజేపీ ప్రభుత్వమే అని, జర్నలిస్టులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల వరకు ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని తెలిపారు. చికోటి (క్యాషినో)వ్యవహారంలో కేసీఆర్ (KCR) కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నదని ఆరోపించారు. ఈ స్కామ్‌ను కూడా డ్రగ్స్ స్కామ్ లాగే నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. నయీమ్ ఎన్కౌంటర్‌ (Naeem Encounter)కు కారణం కేసీఆర్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టినందుకే కేసీఆర్ చేయించారని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-08-04T17:09:41+05:30 IST