కుట్ర వెనుక ఉన్న అన్ని విషయాలను బయటపెడతాం: బండి సంజయ్
ABN , First Publish Date - 2022-03-03T17:28:59+05:30 IST
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వెనుక బీజేపీ ఉందనటాన్ని కమలనాథులు ఖండిస్తున్నారు.
హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వెనుక బీజేపీ ఉందనటాన్ని కమలనాథులు ఖండిస్తున్నారు. గురువారం ఉదయం బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ నివాసానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కోవడం బీజేపీకి కొత్తకాదన్నారు. కుట్ర వెనుక ఉన్న అన్ని విషయాలను బయటపెడతామని స్పష్టం చేశారు. ఆరోపణలతో సీఎం కేసీఆర్ బీజేపీ పోరాటాన్ని ఆపలేరని బండి సంజయ్ అన్నారు.