బండి సంజయ్‌ను టైగర్‌తో పోల్చిన తరుణ్ చుగ్

ABN , First Publish Date - 2022-01-07T19:44:59+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను టైగర్‌తో పోల్చారు ఆ పార్టీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్. కరీంనగర్ సీపీని లోక్‌సభ ముందు దోషిగా నిలబెడతామని హెచ్చరించారు.

బండి సంజయ్‌ను టైగర్‌తో పోల్చిన తరుణ్ చుగ్

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను టైగర్‌తో పోల్చారు ఆ పార్టీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్. కరీంనగర్ సీపీని లోక్‌సభ ముందు దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు పక్షాణ బీజేపీ ధర్మపోరాటం ప్రారంభించిందని తెలిపారు. బండి సంజయ్ అంటే కేసీఆర్‌కు భయమని... అందుకే గ్యాస్ కట్టర్లు వినియోగించారని అన్నారు. కేసీఆర్ భయపెడితే.. బీజేపీ భయపడాలనుందా? అని ప్రశ్నించారు. కరీంనగర్ సీపీని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో ఏమైనా టెర్రరిస్టులు ఉన్నారా? అని నిలదీశారు. ఒక ఎంపీకే రక్షణ లేకుంటే సామాన్యుల సంగతేంది? అని తరుణ్ చుగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-07T19:44:59+05:30 IST