T.news: కేసీఆర్కు ఎలక్షన్ ఫీవర్ కాదు..బీజేపీ ఫీవర్ పట్టుకుంది: Sanjay
ABN , First Publish Date - 2022-07-21T20:13:28+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎలక్షన్ ఫీవర్ కాదు..బీజేపీ ఫీవర్ పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ అన్నారు.
సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కు ఎలక్షన్ ఫీవర్ కాదు..బీజేపీ(BJP) ఫీవర్ పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్(Bandi sanjay) అన్నారు. గురువారం సిద్దిపేట అర్బన్ మండలం నాంచార్ పల్లి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి చేపట్టిన ‘‘ప్రజాగోస - బీజేపీ భరోసా’’ బైక్ ర్యాలీలో సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో ధాన్యం తడిసిపోవడానికి కారణం సీఎం కేసీఆరే అని ఆరోపించారు. పంటను కాపాడలేని సీఎం..ప్రజలనేం కాపాడతారని ప్రశ్నించారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే ‘‘ప్రజాగోస - బీజేపీ భరోసా’’ అని స్పష్టం చేశారు. రైతులకు సీఎం కేసీఆర్ రుణమాఫీ చేయడం లేదన్నారు. తెలంగాణ సంపదను కేసీఆర్ దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈడీ విచారణపై కాంగ్రెస్ నేతలవి అనవసరపు ఆరోపణలన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. ఆగస్ట్ 2 నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లు సంజయ్ ప్రకటించారు.