Bandi sanjay ఇంటికి పోలీసులు

ABN , First Publish Date - 2022-06-10T14:12:03+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు.

Bandi sanjay ఇంటికి పోలీసులు

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay) ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నిరసనలకు బండి పిలుపునిచ్చారు. జేబీఎస్‌లో ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమానికి బీజేపీ ప్రణాళిక చేసింది. ఈ క్రమంలో జేబీఎస్‌కు బండి సంజయ్ వెళ్లకుండా నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుతో సామాన్యుడిపై భారం వేశారని  బీజేపీ ఆరోపిస్తోంది. బస్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా జేబీఎస్‌లో నిరసన చేసి తీరుతామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. 


Updated Date - 2022-06-10T14:12:03+05:30 IST