Bandi sanjay ఇంటికి పోలీసులు
ABN , First Publish Date - 2022-06-10T14:12:03+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు.
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay) ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నిరసనలకు బండి పిలుపునిచ్చారు. జేబీఎస్లో ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందితో ముఖాముఖి కార్యక్రమానికి బీజేపీ ప్రణాళిక చేసింది. ఈ క్రమంలో జేబీఎస్కు బండి సంజయ్ వెళ్లకుండా నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుతో సామాన్యుడిపై భారం వేశారని బీజేపీ ఆరోపిస్తోంది. బస్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా జేబీఎస్లో నిరసన చేసి తీరుతామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.