Vikarabadలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

ABN , First Publish Date - 2021-09-03T18:24:41+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం చిట్టంపల్లి గేట్ నుండి బండి పాదయాత్ర ప్రారంభమైంది.

Vikarabadలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

వికారాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన  ‘‘ప్రజా సంగ్రామ యాత్ర’’ జిల్లాలో కొనసాగుతోంది. శుక్రవారం చిట్టంపల్లి గేట్ నుండి బండి పాదయాత్ర ప్రారంభమైంది. చిట్టంపల్లి గేట్ నుండి మన్నెగూడ క్రాస్ రోడ్, వెంకేపల్లి చౌరస్తా, మన్నెగూడ మీదుగా వికారాబాద్ వరకు యాత్ర కొనసాగనుంది. బండి వెంట పాదయాత్రలో డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ పాల్గొన్నారు. మన్నెగూడ వద్ద బహిరంగ సభలో బీజేపీ అధ్యక్షుడు ప్రసంగించనున్నారు. ఏడో రోజు మొత్తం 12 కిలోమీటర్ల మేర నడవనున్నారు. రాత్రికి వికారాబాద్ సమీపంలోని సాయి డెంటల్ హాస్పిటల్‌లో  బండి సంజయ్ బస చేయనున్నారు. 

Updated Date - 2021-09-03T18:24:41+05:30 IST