సికింద్రాబాద్ ఘటనలో ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదు: Bandi sanjay

ABN , First Publish Date - 2022-06-17T20:14:35+05:30 IST

సికింద్రాబాద్ రైల్వే బోగీలు తగులబెట్టడం, విధ్వంసాలు సృష్టించడంలో ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

సికింద్రాబాద్ ఘటనలో ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదు: Bandi sanjay

కామారెడ్డి: సికింద్రాబాద్ రైల్వే బోగీలు తగులబెట్టడం, విధ్వంసాలు సృష్టించడంలో ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఇంత విధ్వంసం జరుగుతున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అగ్నిపథ్‌కు ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం గుండాలు విద్యార్థుల ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారన్నారు. హైదరాబాదులో బీజేపీ నిర్వహిస్తున్న జాతీయస్థాయి సమావేశాలపై దృష్టి మళ్లించేందుకే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. రైల్వే విధ్వంసంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-06-17T20:14:35+05:30 IST